Homebreaking updates news Sindhu River: సింధూ జలాలు భారత్‌ వే  

 Sindhu River: సింధూ జలాలు భారత్‌ వే  

 భారత్ సమాచార్.నెట్: సింధూ జలాల (Sindhu River) ఒప్పందాన్ని పునరుద్ధరించే సమస్యే లేదని ప్రధాని మోదీ (PM Modi) తేల్చిచెప్పారు. సింధూ జలాలు భారత్‌ (India) వే అని.. వాటిని దేశ ప్రయోజనాలకే వినియోగిస్తామని స్పష్టం చేశారు ప్రధాని. సింధు జలాల ఒప్పందం విరమణ తర్వాత మొదటిసారిగా ప్రధాని ఈ విషయంపై స్పందించారు. ఇంతకు ముందు భారత్‌కు దక్కాల్సినవి కూడా బయటకు వెళ్ళిపోయాయని.. కానీ ఇక మీదట అలా జరగదన్నారు. భారత జలాలు ఇక్కడే ప్రవహిస్తాయి.. ఇక్కడే నిలుస్తాయన్నారు.
చీనాబద్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్థాన్‌కు నీటి ప్రవహాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ప్రాజెక్టు నుండి ప్రవాహాలను తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. అలాగే పహల్గాం దాడిపై కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు, వారికి సహకరించిన వారిని శిక్షించకుండా వదిలేది లేదని మోదీ మరోసారి స్పష్టం చేశారు.
కాగా ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్థాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్థాన్‌ను అష్ఠదిగ్భంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించిన భారత్.. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో తాజాగా భారత్ త్రివిధ దళాలు పాక్ భూభాగంలో మెరుపు దాడులకు దిగింది. ముఖ్యంగా పాక్ పంజాబ్‌లోని మురీద్‌‌కే ప్రాంతం, పీఓకేలో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత్ సైన్యం వైమానిక దాడులు జరిపింది.
RELATED ARTICLES

Most Popular

Recent Comments