భారత్ సమాచార్.నెట్, మెదక్: జిల్లాలో పేకాట స్థావరాలపై జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించారు. రంగంపేట పరిధిలోని ఓ ఫామ్ హౌస్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై అహ్మద్ మోహియుద్దీన్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.32,206 నగదు, ఏడు సెల్ఫోన్లు, నాలుగు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా, గవ్వలపల్లి సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన పేట ఎస్సై నారాయణ గౌడ్, నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఐదు చరవాణులు, ఒక కారు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులతో జిల్లాలో అక్రమ పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నట్లు స్పష్టమవుతోంది. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిన్ని కథనాలు