భారత్ సమాచార్.నెట్: పాన్ ఇండియా స్టార్ (Pan India Star) ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raajasaab). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మొదటిసారి ప్రభాస్ (Prabhas) హారర్ కామెడీ సినిమా (Horror Comedy Movie) చేస్తుండటం.. తాత గెటప్లో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ నెల 16న చిత్ర యూనిట్ టీజర్ను అధికారికంగా విడుదల చేసింది. టీజర్ రిలీజ్ అయిన 24 గంటల వ్యవధిలోనే 59 మిలియన్ వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. అయితే, ఈ టీజర్ను మేకర్స్ విడుదల చేయడానికి మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో మేకర్స్ పోలీసులను ఆశ్రయించారు. టీజర్ లీక్ చేసిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కోట్ల రూపాయలు వెచ్చించి రూపొందిస్తున్న సినిమా ఫుటేజ్ ముందే బయటకు రావడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది చిత్ర యూనిట్. డబ్బింగ్ విభాగంలో ఇంచార్జ్గా ఉన్న వసంత్ కుమార్ టీజర్ను లీక్ చేసినట్లు మేకర్స్ అనుమానిస్తున్నారు. లీక్ చేసిన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు టీజర్ లీక్ వెనుక ఉన్న బాధ్యులు ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హర్రర్ జానర్లో ప్రభాస్కి ఇది మొదటి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.