భారత్ సమాచార్.నెట్: స్టార్ హీరోయిన్ (Heroin) రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో (Movies) ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది. అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్ (National crush)గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అనేక చిత్రాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అనేక చిత్రాల్లో నటించినప్పటికీ పుష్ప మూవీతో ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్గా మారిపోయింది.
నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ భామా.. ఇప్పుడు క్షణం తీరిక లేకుండా సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్గా పుష్ప 2 సినిమాతో పాటు, ఛావా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే బాలీవుడు బడా హీరో సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమాలో రష్మిక నటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. తన బిజీ షెడ్యూల్లో కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో తన వ్యక్తిగత అనుభవాలను, ఆలోచనలను పంచుకుంటుంది ఈ చిన్నది.
తాజాగా రష్మిక సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ పోస్ట్లో.. ఫ్రెండ్స్ని అంత ఈజీగా నమ్మకండి. ఈ రోజు స్నేహితులు ఉన్నప్పటికీ రేపు వారు మీకు స్నేహితులు కాకపోవచ్చు. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో వారితో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ తల్లిదండ్రుల సూచనలు పాటించండి.. వారిని ప్రేమించండి, గౌరవించండి. తల్లిదండ్రుల ప్రేమను లైట్ తీసుకోకండి.. వారు ఇచ్చే సలహాలతో ముందుకు సాగండి అంటూ రాసుకొచ్చింది. రష్మిక చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది.