Homebreaking updates newsRevanth Reddy: పొరుగు రాష్ట్రంతో వివాదాలు కోరుకోవడం లేదు: రేవంత్ రెడ్డి 

Revanth Reddy: పొరుగు రాష్ట్రంతో వివాదాలు కోరుకోవడం లేదు: రేవంత్ రెడ్డి 

భారత్ సమాచార్.నెట్: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో వివాదాలు కోరుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదన్న ఆయన.. అదే సమయంలో ఎవరి కోసమో మా హక్కులను వదులుకోమని తేల్చి చెప్పారు. జల వివాదాలపై ఏపీతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు విషయంలో కూర్చుని మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ వివాదం ఉండేది కాదన్నారు. కేంద్రానికి పీఎఫ్ఆర్ ఇచ్చే ముందే తెలంగాణతో ఏపీ చర్చించి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే.. తొలుత తెలంగాణకు సమాచారం ఇవ్వాలని.. కానీ ప్రాజెక్టుల అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రం వద్దకు వెళ్తోందని ఆరోపించారు. ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చిస్తామని రేవంత్ రెడ్డి. అలాగే ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పారు.
కాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది బనకచర్ల ప్రాజెక్టు. అయితే ఈ ప్రాజెక్ట్‌తో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని ఏపీ వాదిస్తున్నప్పటికీ.. తెలంగాణలో పార్టీల మధ్య యుద్ధమే నడుస్తోంది. బనకచర్లను అడ్డుకుని తీరాలనే లక్ష్యంతో ఉన్నాయి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు. ఈ విషయంపై కేంద్రాన్ని సైతం సంప్రదించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ విషయంలో ఓ వైపు పోరాటం చేస్తూనే.. మరోవైపు రాజీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments