భారత్ సమాచార్.నెట్: టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ – సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ల ఇటీవల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం నవంబర్ 19వ తేదీన జరగాల్సి ఉండగా.. ఆ పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది. రింకూ సింగ్ వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నట్లు సమాచారం. కాగా వివాహం వాయిదా పడటానికి క్రికెటర్ రింకూ సింగ్ బిజీ షెడ్యూల్ కారణం అని సమాచారం.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. నవంబర్లో క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉన్న కారణంగా.. రింకూ తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరువురికి చెందిన కుటుంబాలు ఆ వాయిదాకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రింకూ, సరోజ్ పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి వేదికను వారణాసిలోని హోటల్ తాజ్లో ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ వివాహ తేదీని మార్చారు. తుది తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
ఇకపోతే ఇటీవల లక్నోలో రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థ వేడుక జరిగింది. జూన్ 8న లక్నోలోని ది సెంట్రమ్ అనే 5 స్టార్ హోటల్లో ఈ వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, యూపీ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, జయా బచ్చన్, శివపాల్ యాదవ్, తదితర రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.