Homebreaking updates newsRishab Shetty: తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న రిషబ్ శెట్టి..!

Rishab Shetty: తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న రిషబ్ శెట్టి..!

భారత్ సమాచార్.నెట్: కన్నడ నటుడు (Kannada Actor) రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కాంతార: చాప్టర్ 1 (Kantara Chapter 1)కు వరుస ప్రమాదాలు అండ్డంకిగా మారాయి. గతేడాది ఈ సినిమాలో భాగంగా ఉన్న జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. దాని వెంటనే నటుడు కపిల్‌ నదిలో కొట్టుకుపోయి మృతి చెందగా, ఆ తర్వాత రాకేశ్ పూజారి అనే మరో నటుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ (43) కూడా గుండెపోటుతో కన్నుమూశారు.
వరుసగా చోటుచేసుకుంటున్న ఈ విషాద ఘటనలు చిత్రబృందాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయి. అయితే శనివారం ఈ మూవీ టీమ్ తృటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకుంది. నిన్న సాయంత్రం 30 మందికి పైగా కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు హీరో రిషబ్ శెట్టి సైతం అందులో ఉన్నారు. పడవ మునిగిపోయిన వెంటనే అందులో ఉన్నవారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో కెమెరాతోపాటు పలు సాంకేతిక పరికరాలు నీటపాలైనట్లు తెలుస్తోంది.
ప్రమాదం నుంచి రిషబ్ షెట్టి సహా పలువురు నటులు, కళాకారులు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈ ఘటన గురించి చిత్రయూనిట్ సైతం ఎలాంటి విషయాలను వెల్లడించలేదు. కాంతార చాప్టర్ 1 షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వరుసగా విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాగా 2022లో రిలీజ్ అయిన కాంతార సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. సుమారు రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
RELATED ARTICLES

Most Popular

Recent Comments