Homemain slidesపరమేశ్వరుడు పార్వతికి చెప్పిన మరణ రహస్యాలు...

పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన మరణ రహస్యాలు…

భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;

‘చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాలుడి (యముడు) దృష్టిలో ధనవంతుడైనా, బీదవాడైనా, ఎవరైనా ఒక్కటే. పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు.’ ఇదే కాదు, ఓ వ్యక్తి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది? చావు రహస్యం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ కేదార్నాథ్ కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా, వాటిని యమధర్మ రాజు ఉద్ఘాటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో ఉంది.

అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు. కానీ కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మనుషులంతా ఆధిపత్య, నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతోంది. దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన 5 చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతకు చెప్పినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఆ రహస్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఓం (ఓంకారం) పరమాత్మ స్వరూపం. మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు.

2. యమధర్మ రాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు. దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు.

3. ఆత్మకు జననం లేదు.. మరణం లేదు..

4. మనిషి చనిపోయడంటే అతని పుట్టుక..చావు అనే చక్రం పూర్తిఅయినట్టే.ఇక అతనికి పుట్టుక. చావుల చక్రంతో అతను బ్రహ్మతో సమానం.

5.యమధర్మరాజు చెపిన దని ప్రకారం దేవుణ్ణి నమ్మని మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు.

భగవద్గీత లో శ్రీ కృష్ణ భగవానుడు ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు.ఆత్మ నాశనం కానిది. శస్త్రం ఏది ఛేదించలేనిది. అగ్ని దహించలేనిది. నీరు తడుపలేనిది. వాయువు అర్పలేనిది అని వివరించాడు. ఇంతేకాక అహం బ్రహ్మస్మి అని ప్రభోదించాడు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

శ్రావణ మాస పవిత్రత గురించి తెలుసుకుందాం

RELATED ARTICLES

Most Popular

Recent Comments