Homemain slidesహైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు షాక్‌

హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు షాక్‌

భారత్ సమాచార్, దిల్లీ ; దిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే ఆప్ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తాజాగా ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటికే చాలా సార్లు ఈ కేసులో సమన్లు పంపిన విషయం తెలిసిందే. కానీ ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఈ కేసుపై దిల్లీ హైకోర్టులో విచారణ సాగుతోంది. ఈ కేసులో అరెస్టు నుంచి తనకు మినహాయింపు కావాలని కోర్టును సీఎం తరపు లాయర్ కోరారు. కానీ న్యాయస్థానం అందుకు నిరాకరించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది. దీంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈడీ కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments