భారత్. సమాచార్.నెట్: నాన్ వెజ్(Non Veg) ప్రియులకు చికెన్ (Chicken), మటన్ (Mutton) పేరు చెబితేనే నోట్లో నీళ్లూరుతాయి. ఆదివారం వచ్చిందంటే చాలు.. ఆ రోజు కచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. కొంతమంది అయితే రోజూ నాన్ వెజ్ లాగించేస్తుంటారు. అయితే మటన్ కంటే ఎక్కువగా చాలామంది చికెన్ను ఇష్టంగా తింటారు. అయితే చికెన్లో ప్రొటీన్, విటమిన్ 12 వంటివి పుష్కలంగా ఉంటాయి. రెడ్ మీట్తో పోలిస్తే హెల్త్ రిస్క్లు తక్కువ.. అందుకే డాక్టర్లు కూడా తినమని చెబుతుంటారు.
అయితే, ఇప్పుడు చెప్పబోయే వార్త మాత్రం చికెన్ లవర్స్ను షాకింగ్కు గురించేస్తుంది. ఎందుకంటే.. చికెన్ను అతిగా తినటం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. పలు రకాల పౌల్ట్రీ ఉత్పత్తులు తినడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై శాస్త్రవేత్తలు ఇటీవల ఓ అధ్యయనం చేపట్టారు. దాదాపు 19 సంవత్సరాలు 4 వేల మందికి పైగా వ్యక్తులపై ఓ అధ్యయనం చేపట్టారు.
ఇందులో వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ లేద ఇతర కోళ్ల మాంసం తినడం వల్ల జబ్బుల బారిన పడుతున్నారు. 27 శాతం కంటే ఎక్కువ చికెన్ తింటే జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని తేలింది. అంతేకాదు, పాంక్రియాటిక్ సమస్యలు, లివర్ జబ్బులు, కడుపు నొప్పి, రెక్టల్ క్యాన్సర్ లాంటి వ్యాధులను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇలా పరిమితికి మించి మాంసం తింటున్న వాళ్లలో సుమారు 27 శాతం మంది జబ్బుల బారిన పడతున్నారు. చికెన్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని కూడా పరిశోధకులు చెబుతున్నారు. వారానికి 100 గ్రాముల వరకు చికెన్ తింటే ఎలాంటి ముప్పు ఉండదన్నారు.