భారత్ సమాచార్.నెట్: అమెరికలోని కెనడీ స్పేస్ సెంటర్, స్పేస్ ఎక్స్, ఆక్సియం స్పేస్ సెంటర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రయోగం ఆక్సియం-4 (Axiom-4). ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ ప్రయోగం.. సాంకేతిక సమస్యతో (Technical Issue) మరోసారి వాయిదా పడింది. ఆక్సియం 4 మిషన్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్లానున్న వ్యోమగాముల్లో భారత్కు చెందిన ఓ వ్యామగామి కూడా ఉన్నాడు. నాలుగు దశాబ్దాల తర్వాత భారత్కు చెందిన వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసి యాత్రకు వెళ్లనున్నాడు. ఆక్సియం మిషన్- 4లో భాగంగా భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్, ఇస్రో ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టనున్నారు. దీంతో ఐఎస్ఎస్కు వెళ్తోన్న మొదటి భారతీయుడిగానూ.. రోదసీలో అడుగుపెడుతోన్న రెండో భారతీయుడిగానూ శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. మరి అంతటి ఘనత సాధిస్తున్న ఇస్రో వ్యోమగామి శుభాన్షు శుక్లా అసలు ఎవరు.. ఆయన ఎలా ఇస్రోకి వచ్చారు.. నాసా యాక్సియమ్ 4 ద్వారా స్పేస్లోకి ఎందుకు వెళ్తున్నారో తెలుసుకుందాం..
Shubhanshu Shukla: రోదసిలోకి రెండో భారతీయుడు.. ఎందుకో తెలుసా..?
ఇప్పటి వరకూ మన ప్రయోగాలన్నీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టం వరకే పరిమితమయ్యాయి. 40 ఏళ్ల కిందట 1984 భారత్కు చెందిన రాకేశ్ శర్మ.. రష్యాకు చెందిన సోయజ్ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఆ అవకాశం భారత్కు లభించింది. శుభాన్షు శుక్లా స్పేస్లోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్న శుక్లా కూడా నాసా, ఆక్సియం, స్పేస్ ఎక్స్ సంస్థ కలిసి నిర్వహిస్తున్న ఆక్సియం 4 మిషన్లో వెళ్తున్నారు. అయినా ఈ ప్రయాణం వెనుక ముఖ్య ఉద్దేశం.. 2027లో ఇస్రో నిర్వహించబోయే గగన్యాన్ నిర్వహణకు మన వ్యోమగాములకు కావాల్సిన అనుభవాన్ని సాధించటం కోసమే.
అందుకే శుభాన్షు శుక్లాను ఆక్సియం-4 మిషన్లో భాగం చేసింది ఇస్రో. మిషన్ పైలెట్గా శుభాన్షును పంపిస్తూ నాసాతో ఒప్పందం కుదుర్చుకుంది. అలా శుభాన్షు శుక్లా స్పేస్లోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో రాసుకుంటున్నారు. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్కు శుభాన్షు శుక్లా పైలట్గా వ్యవహరించనున్నారు. శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, హంగరీ నిపుణుడు టిబర్ కపు, పోలాండ్కు చెందిన మరో నిపుణుడు స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడ రెండు వారాలు పాటు పరిశోధనలు సాగించి.. భూమికి తిరిగి రానున్నారు. కాగా నాలుగో మానవసహిత అంతరిక్ష యాత్ర ద్వారా నలుగురూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లనున్నారు. అందుకే ఈ మిషన్కు ఆక్సియం-4గా పేరు పెట్టారు.
ఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన శుభాన్షు శుక్లా డిగ్రీ చదువుతున్నప్పుడే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోటీ పరీక్షలకు హాజరై సెలెక్ట్ అయ్యాడు. 2005లో ఢిల్లీ జేఎన్ యూ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ తర్వాత ఐఐఎస్సీ బెంగుళూరు నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సెలెక్ట్ అయ్యి 2006 ఫ్లైయింగ్ బ్రాంచ్లో సభ్యుడిగా పైలెట్ ట్రైనింగ్ పూర్తి చేశారు. తర్వాత జూనియర్ ర్యాంక్ ఫ్లైయింగ్ ఆఫీసర్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తన బాధ్యతలను ప్రారంభించారు శుభాన్షు శుక్లా. తన కెరీర్లో ఇప్పటివరకూ యుద్ధవిమానాలు నడపటంలో విశేషమైన అనుభవాన్ని సంపాదించారు శుభాన్షు.
సుఖోయ్ యుద్ధవిమానం, మిగ్ 21, మిగ్ 29, జాగ్వార్, హాక్, ఏంటనోవ్, డోర్నియర్ ఇలా వేర్వేరు ఎయిర్ ఫోర్స్ విమానాలను నడిపి వింగ్ కమాండర్ స్థాయికి చేరుకున్న శుభాన్షు.. 2019లో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. శుక్లాను వ్యోమగామిగా ఎంపిక చేసింది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘గగన్నయాన్’ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో శుక్లా ఒకరు. వీరంతా రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో 2021లో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నారు. తర్వాత బెంగళూరులోని అంతరిక్ష యాత్రికుల శిక్షణ కేంద్రంలో మరింత రాటుదేలారు. అలా అంతరిక్ష యాత్రకు సర్వ సన్నద్ధం అయిన శుభాంశు శుక్లాకు ‘యాక్సియం-4’ మిషన్ రూపంలో అవకాశం వరించింది.
RELATED ARTICLES