భారత్ సమాచార్.నెట్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో స్మృతి మొదటి స్థానంలో నిలిచింది. 2019 తర్వాత మళ్లీ ఆమె ఈ స్థాయికి చేరడం గమనార్హం. దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వోల్వార్డ్ (Laura Wolvaardt) ఇటీవల 19 రేటింగ్ పాయింట్లను కోల్పోవడంతో స్మృతికి టాప్ ర్యాంక్ చేరుకోవడానికి అవకాశమొచ్చింది.
ప్రస్తుతం స్మృతి మంధాన 727 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్ కెప్టెన్ నటాలీ స్కీవర్-బ్రంట్ 719 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. వోల్వార్డ్ కూడా 719 పాయింట్లే ఉన్నా, తక్కువ మ్యాచులు ఆడడం వలన మూడవ స్థానానికి పరిమితమైంది. టాప్ 10లో నాలుగు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉండడం విశేషం. భారత బ్యాటర్లలో స్మృతి తర్వాతి స్థానాల్లో జెమీమా రోడ్రిగ్స్ (14వ స్థానం), హర్మన్ప్రీత్ కౌర్ (15వ స్థానం) ఉన్నారు. వీరిద్దరూ కూడా టాప్-20లో నిలవడం భారత మహిళా క్రికెట్కు గర్వకారణంగా మారింది.
ఇకపోతే ఇటీవలే ముగిసిన ట్రై-నేషన్ టోర్నమెంట్లో స్మృతి మంధాన అదరగొట్టింది. మొత్తం 5 మ్యాచ్ల్లో 52.80 యావరేజ్తో 264 పరుగులు చేసింది. ఆమె స్ట్రైక్ రేట్ 90.41గా ఉంది. అదే సమయంలో ఇటీవలే వెస్టిండీస్తో ముగిసిన సిరీస్లో వోల్వార్డ్ రాణించలేకపోయింది. ఈ సఫారీ కెప్టెన్ రెండు మ్యాచ్ల్లో వరుసగా 27, 28 పరుగులు మాత్రమే చేయగలిగింది. బౌలర్ల విభాగంలో ఇంగ్లాండ్కు చెందిన సోఫి ఎక్లెస్టోన్ 747 పాయింట్లోత అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ నాలుగో స్థానానికి చేరుకుంది.