భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
నేటి ప్రత్యేకం
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
ప్రపంచ టాయిలెట్ దినోత్సవం
చరిత్రలోని ప్రముఖ సంఘటనలు
1977: ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలను, ముఖ్యంగా కృష్ణా జిల్లా దివిసీమను అతలా కుతలం చేసిన పెను తుఫాను వచ్చిన రోజు.
ప్రముఖుల జననాలు
1828 : ఝాన్సీ లక్ష్మీబాయి , భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (మ.1858) – మరాఠా సామ్రాజ్య ప్రాంతంలో అమరవీరుల దినోత్సవముగా జరుపుకుంటారు.
1852 : అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్ , భారత్లోని బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల స్థాపకుడు.
1917 : ఇందిరా గాంధీ , భారత మాజీ ప్రధానమంత్రి.
1923 : మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త, దాత.
1928 : దారా సింగ్ , భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు.
1954 : చింతా మోహన్ , ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంటు సభ్యుడు.
1960 : శుభలేఖ సుధాకర్ , నటుడు.
1965: కిల్లి కృపారాణి , రాజకీయ నాయకురాలు, వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 వ లోక్సభకు ప్రాతినిద్యం.
1973 : షకీలా , భారతీయ నటి.
1975 : సుష్మితా సేన్ , విశ్వ సుందరి పోటీలో విజేతగా ఎన్నుకొనబడి భారతీయ నటి.
ప్రముఖుల మరణాలు
1806 : రెండవ షా ఆలం , మొఘల్ చక్రవర్తి.
1995 : రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి , ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు.
1995 : మద్దిపట్ల సూరి , రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త.
2007 : పులికంటి కృష్ణారెడ్డి , కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు.
2022 : మదన్ , తెలుగు సినీ దర్శకుడు