Homemain slidesకాంగ్రెస్ వల్లే నేతన్నల ఆత్మహత్యలు... కేటీఆర్

కాంగ్రెస్ వల్లే నేతన్నల ఆత్మహత్యలు… కేటీఆర్

భారత్ సమాచార్, హైదరాబాద్ ;

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నేతన్నలపై కక్ష గట్టి వారి ప్రాణాలు తీస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతల ఆత్మహత్యలు నివారించి వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించామని గుర్తు చేశారు. 7 ఏళ్ల పాటు కొనసాగిన ఈ బతుకమ్మ చీరల ఆర్డర్ల కారణంగా రాష్ట్రంలో చేనేతలు, నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయాయని చెప్పారు. ఏటా రూ.350 కోట్ల బడ్జెట్ తో బతుకమ్మ, రంజాన్, క్రిస్ మస్ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కోటి చీరలను పంపిణీ చేసేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

బీఆర్ఎస్ సదుద్దేశంతో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కారణంగా పేద మహిళలకు పండుగ పూట ప్రభుత్వ కానుకగా చీర అందేదన్నారు. అదే విధంగా చేనేత కార్మికులు, నేతన్నలు అనుబంధంగా ఎంతో మంది ఉపాధి పొందే వారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసిన కారణంగా ఇప్పటికే 10 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత చర్యలు మాని వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి నేతన్నలు, చేనేతలకు ఉపాధి కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్

RELATED ARTICLES

Most Popular

Recent Comments