Homebreaking updates newsభూమిపై సేఫ్‌గా ల్యాండ్ అయిన సునీతా విలియమ్స్

భూమిపై సేఫ్‌గా ల్యాండ్ అయిన సునీతా విలియమ్స్

భారత్ సమాచార్.నెట్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ (Butch Wilmore) సహా మరో ఇద్దరు వ్యోమగాములతో కూడిన నాసా క్రూ డ్రాగన్ స్పేస్ ఫ్లైట్ 17 గంటల ప్రయాణం తర్వాత వారిని సురక్షితంగా భూమి పైకి చేర్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన క్రూ డ్రాగన్ స్పేస్ ఫ్లైట్.. బుధవారం తెల్లవారుజామున 3.37కి అమెరికా (America)లోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగింది. దాదాపు 9 నెలల నిరీక్షణ తర్వాత.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సునీతా విలియమ్స్ భూమిని చేరుకోవడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

గంటకు దాదాపు 27 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చిన డ్రాగన్ క్రూ క్యాప్సుల్ క్రమంగా వేగం తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు 186 కిలోమీటర్ల వేగానికి చేరుకున్నాక దాని 4 పారాచూట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత వేగాన్ని మరింత తగ్గించుకుని సుమద్ర జలాల్లో సేఫ్‌గా ల్యాండ్ అయింది. అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది క్యాప్సుల్‌ను ఓ బోటుపైకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం లోపలున్న వ్యోమగాములను బయటకు తీసి హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వారు భూమి గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యే వరకు నిపుణుల పర్యవేక్షణలో ఉంటారు.

 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అమెరికాతో పాటు పలు అగ్రదేశాలు ఏర్పాటు చేసుకున్న కృత్రిమ ఉపగ్రహం. అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రోజుకు పదిహేను సార్ల వరకూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ జీరో గ్రావిటీ ఉంటుంది. గాల్లో తేలుతూ ఉండాలి. అలాంటి కఠిన పరిస్థితుల్లో సునీతా విలియమ్స్‌తో పాటు మరో ముగ్గురు తొమ్మిది నెలలు గడిపారు. వారి ఆరోగ్యం క్షీణించే పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి నాసాకు స్పేస్ ఎక్స్ సాయం ఉపయోగపడింది. వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలించడంతో ఎట్టకేలకు విజయవంతంగా వారు పుడమికి చేరుకున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments