భారత్ సమాచార్ ; ఒక వైపు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తు, మరో వైపు గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు తెలుగు దేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్ర బాబు నాయుడు. రాబిన్ శర్మ షో టైమ్ కన్సల్టెన్సీ సర్వేలతో పాటుగా, ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించి కూటమి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాజాగా టీడీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచే తుది జాబితాను విడుదల చేశారు. ఈ ఫైనల్ లిస్ట్ లో నలుగురు ఎంపీ అభ్యర్థులతో పాటుగా 9 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. దీంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠకు కూడా తెర పడింది.
లోక్ సభకు పోటీ చేసే తెలుగుదేశం ఎంపీ అభ్యర్థులు
1. విజయనగరం లోక్సభ – అప్పలనాయుడు
2. ఒంగోలు లోక్సభ – మాగుంట శ్రీనివాసులరెడ్డి
3. అనంతపురం లోక్సభ – అంబికా లక్ష్మినారాయణ
4. కడప లోక్సభ – చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి ని బరిలోకి నిలిపారు.
అసెంబ్లీకీ పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు
1. చీపురుపల్లి అసెంబ్లీ – కళా వెంకట్రావు
2. భీమిలి – గంటా శ్రీనివాసరావు
3. పాడేరు – వెంకటరమేష్ నాయుడు
4. దర్శి – గొట్టిపాటి లక్ష్మి
5. రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం
6. ఆలూరు – వీరభద్ర గౌడ్
7. గుంతకల్లు – గుమ్మనూరు జయరాం
8. అనంతపురం అర్బన్ – దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్
9. కదిరి – కందికుంట వెంకటప్రసాద్ పేర్లను నేడు ప్రకటించారు.
మరి కొన్ని రాజకీయ విశేషాలు..