Homemain slidesకులం కంపు.. స్వార్థ రాజకీయాలు.. ఇదే మన దేశ అభివృద్ధి

కులం కంపు.. స్వార్థ రాజకీయాలు.. ఇదే మన దేశ అభివృద్ధి

భారత్ సమాచార్, జాతీయం : మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికీ 75 ఏళ్లు దాటింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మన దేశం అభివృద్ది చెందుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా డెవలప్ అవుతూనే ఉంటుంది. అంతర్జాతీయ వేదికల్లో మన దేశాధినేతలు ఇప్పటికీ..ఎప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని చెపుతూనే ఉంటారు. రాబోయో తరాల వారికి ఇదే అరిగిపోయిన మాటలు, అర్దం లేని అభివృద్ది గురించి ఖద్దరు వేసుకున్న కరప్టెడ్ నాయకులు ఎర్ర కోటపై జెండా ఎగవేసి, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివి, దేశ అభివృద్ధి గురించి చెప్తూనే ఉంటారు. మనం తరతరాలుగా ఇలాంటి మాటలు వింటూనే ఉంటున్నాం..వింటూనే ఉంటాం కూడా.

అసలు అభివృద్ధి చెందడం అంటే ఇదేనా..?

కరోనాకి మందు గోమూత్రం అని చెప్పి కొందరు మతిలేని మతపిచ్చి వెధవలు వెనకా ముందు ఆలోచించకుండా దానిని తాగారు. ఇదే నా మన అభివృద్ధి..? ఒకడు జై శ్రీరామ్ అనకపోతే చంపుతాడు. మరోకడు ఆవు మాంసం తింటే చంపుతాడు. మరోకడు హిందూ దేవుళ్లను తిడితే చంపుతాడు. మరోకడు మన దేశంలోనే ఉంటూ బాంబులు పెట్టి చంపుతాడు. ఇంకోకడు భారతదేశంలోనే ఉంటూ..పాకిస్ధాన్ కి జై కొడతాడు. అన్యాయాన్ని ఎదిరించిన వాళ్లని హత్య చేస్తారు. అభం శుభం తెలియని చిన్నారులను చిధిమేస్తున్నారు. ఆకలి సూచిలో మన పక్క దేశాలైన పాకిస్ధాన్, శ్రీలంకల కన్నా అట్టడుగు స్ధానంలో ఉన్నాం. అవినీతిలో అగ్రస్థానంలో ఉంటాం. ఆయు ప్రమాణంలో అంతంత మాత్రంగానే ఉంటాం. ఇన్నోవేషన్ ర్యాంకులో వెనకపడిపోతున్నాం. మానవాభివృద్ధి సూచిలో, ప్రెస్ ఫీడంలో దారుణంగా మన ర్యాంకు పడిపోయింది. అయినా సరే మనం అభివృద్ది చెందుతూనే ఉంటుంది.

అభివృద్ధి అంటే రాత్రీ..పగలు కష్టపడి జనాభా పెంచడం కాదు (2025 కల్లా మన దేశ జనభా మొదటి స్థానానికి వస్తుంది). పెరిగిన జనాభాకు సరిపడా వనరులను సమకూర్చడం. ప్రజల జీవన విధానాన్ని దారిద్రవ్య రేఖకు దిగువన లేకుండా చేయడం. అంటే కనీస అవసరాలైన కూడు, గూడూ, గుడ్డ ఉంటేలా చూడటం. కానీ మనం దేశంలో కనీస అవసరాలైన ఈ మూడు లేక ఇప్పటికీ సుమారు 20 కోట్ల మంది నిత్యం నరకరం చూస్తూ..ఆకలికి అలమటిస్తూ.. తల దాచుకోవడానికి గూడు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కానీ ప్రభుత్వానికి ఇవేమీ పట్టవు కదా.. పడమరలో (గుజరాత్) ఒక పెద్ద స్టేడియం, ప్రజలకు అవసరం లేని ఒక పెద్ద విగ్రహం కట్టి..తూర్పున ఒక గుడి నిర్మించి, సామాన్య ప్రజలు ఎక్కలేని బుల్లెట్ ట్రైన్ లు తీసుకవచ్చినంత మాత్రాన మన దేశం అభివృద్ది చెందినట్లు కాదు కదా. ప్రజల కనీస అవసరాలు తీరినప్పుడు..ఆకలి చావులు ఆగినప్పుడు..నిరుద్యోగం తగ్గినప్పుడే మన దేశం అభివృద్ధి చెందినట్లు లెక్క.

 అభివృద్ది అంటే ఇలా ఉండాలి

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా జపాన్ మీద అణు బాంబులు వేసింది. అప్పుడు ఆ ప్రాంతంలో గడ్డిపూచ కూడా మొలవలేదు. వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. లక్షల మంది దివ్యాంగులు అయ్యారు. అణుబాంబు రేడియోషన్ వల్ల ఎందో మంది క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడ్డారు. ఇక జపాన్ పని అయిపోయిందనుకున్నారు. కానీ పడిలేచిన కెరటంలాగా ఆ దేశం చాలా తక్కువ సమయంలోనే అణుబాంబు తీవ్రత నుంచి తేరుకోని బుల్లెట్ ట్రైన్లు, రోబో టెక్నాలజీ అంటూ ఎవరు ఊహించని విధంగా అద్బుత ప్రగతి సాధించింది. నేడు ప్రపంచ దేశాలకు జపాన్ దిక్సూచిలా మారింది.

ఇక ఆ కోవకు చెందినదే సింగపూర్ దేశం. పేరులోనే పూర్ అని ఉన్న దేశం. ఒకప్పుడు మన దేశ తలసరి ఆదాయంలో మన కంటే ఏడు రెట్లు వెనకల ఉండేది. అసలు టెక్నాలజీ అంటే ఏంటో తెలియని దేశం. ఆకలితో అలమటించిన దేశం. అభివృద్ది అంటే అర్ధం తెలియని దేశం సింగపూర్. కానీ ఇప్పుడు ఆ దేశ తలసరి ఆదాయం మన దేశ తలసరి ఆదాయం కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఆ దేశ ప్రజలకు ఆకలితో పస్తులు ఉండటం అంటే ఎంటో తెలియదు. టెక్నాలజీలో ఒక వంద సంవత్సరాలు ఎంతో అడ్వాన్స్ గా ఉంది. ఆకాశహర్మ్యాలు..అబ్బురపరిచే కట్టడాలు, ఆశ్చర్యాన్ని కలిగించే ఆత్యాధునిక టెక్నాలజీలు..ఇలా చెప్పుకుంటూపోతే మనకు తెలియనివి ఇంకా చాలానే ఉన్నాయి. అనతి కాలంలోనే సింగ ‘పూర్’ ఊహించని ప్రగతిని సాధించింది. ఇదంతా ఆ దేశానికి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ది ఎలా సాధ్యం అయ్యింది. మన దేశానికి ఎందుకు సాధ్యం కాలేదో ఒక్కసారి చరిత్రను తిరగేయండి మీకే తెలుస్తుంది.

ఇంకా చెప్పుకుంటూ పోతే మన కంటే జీడీపీలో అట్టడుగు స్థాయిలో ఉన్న చాలా దేశాలు అనతి కాలంలోనే ఎంతో ప్రగతి సాధించాయి. ఎందుకంటే ఆ దేశాల్లో అవినీతి..కులం కంపు..స్వార్థ రాజకీయాలు లేవు కాబట్టి. ఈ మూడు ఉన్నంత వరకు మన భారతదేశం ఇంకో వెయ్యి సంవత్సరాలు అయినా అభివృద్ది చెందుతూనే ఉంటుంది. ఈ మాటలు మనం వింటూనే ఉంటాం.
జై భారత్..
జై హింద్..

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

ప్రమాదకర స్థాయికి భారత్‌ అప్పులు..

RELATED ARTICLES

Most Popular

Recent Comments