Homemain slidesఇలా చేస్తే పిడుగుల మీ మీద అస్సలు పడవు

ఇలా చేస్తే పిడుగుల మీ మీద అస్సలు పడవు

భారత్ సమాచార్, జాతీయం: ఈసారి మే నెల నుంచి వర్షాలు ఉరుములు, మెరుపులతో దంచికొడుతున్నాయి. రుతుపవనాలు కూడా సమయానికే వచ్చాయి. దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సారి వర్షాలతో పాటు భారీగా ఉరుములు, మెరుపులు పడుతున్నాయి. దీంతో చాలా మంది రైతులు, రైతు కూలీలు, మూగజీవాలు చనిపోతున్నాయి. అంతుకే ఉరుమములు మెరుపులు పడుతున్నసమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు అస్సలే బయట ఉండకూడదంట. అంతే కాకుండా పిల్లలను పొరపాటున కూడా బయటకు రానివ్వకూడదు. ఎందుకంటే మెరుపులు వస్తున్నప్పుడు ఒకేసారి మెరుపు పిల్లల కంట్లో పడితే వాళ్ల కళ్లకు చాలా ప్రమాదం.

* ఉరుములు, మెరుపుల వస్తున్న సమయంలో పొలంలో పని చేసే రైతులు వెంటనే చెట్ల కిందికి వెళ్తారు. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద ఉండకూడదు. ఎందుకంటే చెట్లు మెరుపులను వెంటనే ఆకర్షించుకుంటాయి. అందువల్ల ఎక్కువగా చెట్ల మీదే పిడుగులు పడుతుంటాయి. అందుకే చెట్ల కింద ఉండకూడదు.

* బైక్ పై వెళ్తున్నప్పుడు ఉరుములు, మెరుపులు అధికంగా ఉంటే జర్నీని ఆపివేసి, సురక్షితమై ప్రాంతానికి వెళ్లాలి.

* అలాగే విపరీతంగా ఉరమడం, మెరుపులు వస్తున్న సమయంలో ఇంట్లో కరెంట్ మెయిన్ ఆఫ్ చేయడం, మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ పెట్టకూడదు. మీ మొబైల్ డేటాను కూడా ఆఫ్ చేసి పెట్టుకుంటే మరింత సురక్షితంగా ఉంటారు. అలాగే మొదట టీవీ మాత్రం తప్పకుండా ఆఫ్ చేయాలి. లేదంటే టీవీలు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. లేదా టీవీలు పాడయ్యే అకవాశం ఉంది.

* స్విమ్మింగ్ ఫూల్లో స్నానం చేస్తున్న క్రమంలో ఉరుములు, మెరుపులు వస్తే తప్పకుండా స్విమ్మింగ్ ఫూల్ నుంచి బయటకు రావాలి ఎందుకంటే, పిడుగులు జలాశయాన్ని తాకుతాయి. ఒక వేళ అలా జరిగితే పెను విపత్తు సంభవించే అవకాశం ఉంది.

ఇలా చేస్తే పిడుగులు మీ ఇంటి మీద పడవు
సిటిల్లో పెద్ద పెద్ద భవంతుల మీద లేదా టవర్స్ మీద ఒక సన్నటి త్రిశూలం ఆకారంలో ఉండే తీగను పెడతారు. ఎందుకంటే ఎతైన వాటి మీదే ఎక్కువ పిడుగులు పడతాయి. కాబట్టి వాటి మీద పిడుగులు పడకుండా రాగితో తయారు చేసిన పొడవాటి రాడ్డును వాటిపై అమర్చుతారు. ఒకవేళ పిడుగు ఆ బిల్డింగ్ లేదా టవర్స్ మీద పడితే వెంటనే ఆ రాగితో ఉన్న రాడ్డు ఆకర్షించుకుంటుంది. దీంతో పిడుగుల వేడికి ఆ రాగి రాడ్డు కరిపోతుంది. దీని వల్ల వాటి ఎలాంటి ప్రమాదం జరగదు. ఇలాంటివి రాగి వస్తులు పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీదే కాదు. మన పూరి గుడిసెల ముందు లేదా మన ఇంటి మీద కూడా పెట్టుకోవచ్చు. దీంతో పిడుగుల బారిన నుండి తప్పించుకోవచ్చు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రధానిగా మోదీ ప్రమాణం.. ఉలిక్కిపడ్డ దేశం

RELATED ARTICLES

Most Popular

Recent Comments