Homemain slidesదేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ రుణ మోసం ఇది

దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ రుణ మోసం ఇది

భారత్ సమాచార్, క్రైమ్ ;

రూ. 34 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ)తాజాగా అరెస్టు చేసింది. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పలు బ్యాంకులకు రూ. 34,000 కోట్ల మోసం కేసులో గతంలోనే ఆయన అరెస్ట్ అయ్యారు.

2022వ సంవత్సరంలో ఈ కేసుకు సంబంధించి వాధ్వాన్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. యెస్ బ్యాంక్ అవినీతి కేసులో ధీరజ్ వాధ్వాన్‌ను గతంలో ఏజెన్సీ అరెస్టు చేస్తే, ఆయన బెయిల్‌పై ఉన్నారు. 17 బ్యాంకుల కన్సార్టియం ను రూ.34,000 కోట్ల మేర మోసం చేసిందని ఆరోపిం చిన DHFL కేసును సీబీఐ నమోదు చేసింది. ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ రుణ మోసాల్లో ఒకటని బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు పేర్కొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో, సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) రూ.22 లక్షల విలువైన బకాయిల ను రికవరీ చేయడానికి, మాజీ DHFL ప్రమోటర్లు ధీరజ్, కపిల్ వాధ్వాన్‌ల బ్యాంక్ ఖాతాలతో పాటు షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్‌లను అటాచ్‌ మెంట్ చేయాలని దర్యప్తు అధికారులను ఆదేశించింది.నిబంధనలను ఉల్లంఘించిన కేసులో గత ఏడాది జూలైలో వాధ్వాన్‌ సోదరులుపై విధించిన జరిమానాను చెల్లించడంలో విఫలమవడంతో మార్కెట్ నియంత్రణ సంస్థ ఈ చర్య చేపట్టవలసి వచ్చింది.

2023వ సంవత్సరం జులై నెలలో నిబంధనలను ఉల్లంఘించి నందుకు, DHFL ప్రస్తుతం పిరమల్ ఫైనాన్స్ ప్రమోట ర్లుగా ఉన్న వాధ్వాన్‌లపై రెగ్యులేటరీ బోర్డు ఒక్కొక్కరికి రూ.10 లక్షల జరిమానా విధించింది. ఆ సమయంలో కపిల్ వాధ్వాన్ DHFL ఛైర్మన్, MDగా ఉండగా, ధీరజ్ వాధ్వాన్ కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వారిద్దరూ DHFL బోర్డు సభ్యులుగా ఉన్నారు. వైద్య కారణాలతో బెయిల్ కోరుతూ ధీరజ్ వాధ్వాన్ చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గత శనివారం సీబీఐకి నోటీసులు జారీ చేసింది. వైద్యపరమైన కారణాలతో బెయిల్‌ను నిరాకరించిన ట్రయల్‌ కోర్టు తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ముంబైలోని తన ఇంట్లో చికిత్స పొందుతున్నారు. జస్టిస్ జ్యోతి సింగ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి నోటీసు జారీ చేసి, సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసు విచారణను మళ్లీ ఈ నెల 17వ తేదీన చేపట్టనున్నారు.

మరికొన్ని విశేషాలు…

నాడు పరిచయస్థులే.. నేడు విలన్లుగా మారి

RELATED ARTICLES

Most Popular

Recent Comments