Homemain slides'కేసీఆర్ మోసానికి కాలం చెల్లింది'

‘కేసీఆర్ మోసానికి కాలం చెల్లింది’

భారత్ సమాచార్, భద్రాద్రికొత్తగూడెం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించడం ఎంతో సంతోషమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం భద్రాద్రిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నాడు ఇందిరమ్మ పాలనలో ఉంటే నేడు ప్రజా పాలనలో మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల పథకం అని అన్నారు.

కేసీఆర్‌ను బొంద పెట్టారు:
ఇల్లాలి ముఖంలో సంతోషం ఉండేలా పేద వాళ్ళు ఆత్మ గౌరవంతో బతికేలా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇంటి పట్టా ఆడబిడ్డ పేరు మీద ఇస్తామన్నారు. డబ్బా ఇళ్ళు వద్దు పండగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ ఉంటారు అంటూ పేదల కలల మీద కేసీఆర్ రాజకీయ వ్యాపారం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ మోసానికి కాలం చెల్లిందని తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బొంద పెట్టారన్నారు.

కన్నీళ్లు తుడవడానికే సంక్షేమ పథకాలు:
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్‌ల మధ్య గతంలో వైరుధ్యాలున్నా నేడు కాంగ్రెస్ సీపీఐ కలసి పనిచేస్తున్నామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కేసీఆర్‌ను నమ్మలేదన్నారు. రామాలయం అభివృద్ధిపై మంత్రి తుమ్మల చెప్పారని.. రిటైనింగ్ వాల్ కోసం రూ.500 కోట్లు ఈరోజే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 92 రోజుల్లోనే గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. 24 కోట్ల మంది ఆడ బిడ్డలు ఉచిత ప్రయాణం చేశారన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంతో పేదల ఆరోగ్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆడబిడ్డల కన్నీళ్ళు తుడవడానికి సోనియమ్మ ఆలోచనలతో రూ.500 కే గ్యాస్ సిలిండర్‌ను అందజేస్తున్నట్లు చెప్పారు. పేదల ఇళ్లకు కరెంట్ బిల్లులు భారం లేకుండా గృహ జ్యోతి పథకం తీసుకొచ్చామన్నారు. మీడియా రంగంలో ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తిస్తున్నారు.

మరికొన్ని రాజకీయ కథనాలు…

‘కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే’

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments