Homemain slidesచరిత్రలో ఈరోజు అక్టోబర్-17 

చరిత్రలో ఈరోజు అక్టోబర్-17 

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రత్యేకం

అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినోత్సవం.

ప్రముఖుల జననాలు

1872: చిలుకూరి వీరభద్రరావు, పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చేసిన ఇతిహాసకుడు.

1901: జి.ఎస్.మేల్కోటే, సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు, పరిపాలనా దక్షుడు.

1920: షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి.

1929: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు, ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు, కవి, నాటకకర్త.

1948: అన్నపూర్ణ (నటి), ఏడువందల సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి.

1955: స్మితా పాటిల్, హిందీ సినీనటి.

1970: అనిల్ కుంబ్లే, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

1980: చిరంజీవి సర్జా, కన్నడ సినిమా నటుడు.

1992: కీర్తీ సురేష్, మలయాళం, తమిళ, తెలుగు సినిమా నటి.

ప్రముఖుల మరణాలు

1937: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు.

2014: ఎనుముల సావిత్రీదేవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక రాజకీయ నాయకురాలు. ఈమె శాసనమండలి సభ్యురాలు.‌‌

ప్రముఖ చారిత్రక సంఘటనలు

1933: నాజీ ల దురాగతాలు భరించలేక మాతృభూమి (జర్మనీ) ని వదిలి ఐన్‌స్టీన్‌ అమెరికాకు పయనం.

1949: జమ్ము, కాశ్మీర్‌ లకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 వ నిబంధనను చట్టసభలు స్వీకరించాయి.

1979: మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.

2003: ‘జితి జితాయి పాలిటిక్స్‌’… మధ్యప్రదేశ్‌లో హిజ్రా ల తొలి రాజకీయపార్టీ స్థాపన.

మరికొన్ని వార్తా విశేషాలు...

చరిత్రలో ఈరోజు అక్టోబర్-16

RELATED ARTICLES

Most Popular

Recent Comments