Homemain slidesచరిత్రలో ఈరోజు అక్టోబర్-22

చరిత్రలో ఈరోజు అక్టోబర్-22

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రత్యేకం

అంతర్జాతీయ నత్తి అవగాహన రోజు

ప్రముఖుల జననాలు

1894: కోలవెన్ను రామకోటీశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు.

1901: కొమురం భీమ్ హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవంశమునకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (మ.1940)

1927: గుంటూరు శేషేంద్ర శర్మ, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

ప్రముఖుల మరణాలు

1996:పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు.

2020:నాయిని నర్సింహారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి.

ప్రముఖ చారిత్రక సంఘటనలు

1764: బక్సర్ యుద్ధం జరిగింది. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ కి, బెంగాలులో మొగలుల పాలకుడు మీర్ కాసింసేనలకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచి, భారత్‌లో తన అధికారాన్ని స్థిరపరచుకుంది. కంపెనీ సేనలకు హెక్టర్ మన్రో నాయకత్వం వహించాడు.

1953: లావోస్ ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.

1960: మాలి ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.

1966: సోవియట్ యూనియన్ లూనా-12 అంతరిక్షనౌకను ప్రయోగించింది.

1975: సోవియట్ యూనియన్ ప్రయోగించిన మానవరహిత అంతరిక్ష మిషన్ వెనెర-9 శుక్రగ్రహంపై దిగింది.

1981: పారిస్-లియాన్‌ ల మధ్య టిజివి రైలు సర్వీసు ప్రారంభమైనది.

2008: భారతదేశం తొలి మానవరహిత చంద్రమండల నౌక చంద్రయాన్-1ను ప్రయోగించింది.

2015 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి, ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా శంకుస్థాపన ఉద్దండరాయుని పాలెంలోజరిగింది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

చరిత్రలో ఈరోజు అక్టోబర్ 19

RELATED ARTICLES

Most Popular

Recent Comments