Homebreaking updates newsచరిత్రలో ఈ రోజు ముఖ్య ఘటనలు

చరిత్రలో ఈ రోజు ముఖ్య ఘటనలు

భారత్ సమాచార్: చరిత్రలో ఈరోజు ఏప్రిల్/01🌍

🔎సంఘటనలు🔍

🌾1914: ఆంధ్రపత్రిక, వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై) . తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ( 1908 సెప్టెంబరు 9) ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.

🌾1935: భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.

🌾1936: కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే ఒడిషా భారతదేశంలో క్రొత్త రాష్ట్రంగా అవతరించింది.

🌾1957: డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న ‘డబ్బు’, ‘రూపాయి’ లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబరు 1958 న ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి కొలమానం (యూనిట్) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.

🌾1960: TIROS-1 ఉపగ్రహం టెలివిజన్ మొదటి చిత్రాన్ని అంతరాళం నుండి ప్రసారం చేసింది.

🌾1973: పులుల సంరక్షన పథకం – కోర్బెట్ట్ నేషనల్ పార్కులో పులుల సంరక్షణా పథకాన్ని ప్రారంబించారు.

🌾2001: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం నెదర్‌లాండ్స్.

🌾2010 : RTE- విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం..

🌺జననాలు🌺

💐1578: విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (మ.1657)

💐1856: అకాసియో గాఅబ్రియెల్ వేగాస్, భారత దేశ ప్రముఖవైద్యుడు. (మ.1933)

💐1889: డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (మ.1940)

💐1911: ఫాజా సింగ్, భారత అథ్లెట్.

💐1911: ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (మ.1949)

💐1936: తరున్ గొగోయ్, భారత రాజకీయ వేత్త, అసోం ముఖ్యమంత్రి.

💐1941: అజిత్ వాడేకర్, భారత క్రికెటర్.

💐1963: వినోద్ కుమార్ సినీ నటుడు.

💐1972: వెంకట్ గోవాడ, రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్మాత, టి.వి., చలనచిత్ర నటుడు.

💐1988: లహరి గుడివాడ, రంగస్థల నటి.

💐1993: శ్రీదివ్య, బాల నటి గా ప్రవేశించి తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.

🥀మరణాలు🥀

💐1922: హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1884)

💐1943: మైలార మహాదేవప్ప, కర్ణాటకకు చెందిన విప్లవ వీరుడు. (జ.1911)

💐1999: మధురాంతకం రాజారాం, రచయిత. (జ.1930)

💐2012: ఎన్.కె.పి.సాల్వే, భారత రాజకీయవేత్త. (జ. 1921)

💐2018: రాజ్యం. కె, రంగస్థల నటి. (జ.1956)

💐2022: శరత్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు.

పండుగలు, జాతీయ దినాలు

🍂ఒడిషా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.

మరికొన్ని విశేషాలు…

మార్చి 31న జరిగిన ముఖ్యమైన ఘటనలు

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments