Homebreaking updates newsTourists: పహల్గామ్‌కు మళ్లీ క్యూ కట్టిన టూరిస్టులు

Tourists: పహల్గామ్‌కు మళ్లీ క్యూ కట్టిన టూరిస్టులు

భారత్.సమాచార్.నెట్: జమ్ము కశ్మీర్‌ (Jammu &Kashmir)లోని ప్రముఖ పర్యాటక కేంద్రం (Tourist spot) పెహల్గామ్‌ (Pahalgam) లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉగ్రవాదుల దాడి తర్వాత కొన్ని రోజుల పాటు నిర్మానుష్యంగా మారిపోయిన ఆ ప్రాంతం మళ్లీ టూరిస్ట్‌ల (Tourists)తో కళకళాలాడుతోంది. కొన్ని రోజుల పాటు ఆంక్షలు విధించగా.. తాజాగా ఆ ఆంక్షలను ఎత్తివేయడంతో దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు.
మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్‌ వ్యాలీలో ఉగ్రదాడి జరిగిన అనంతరం ఆ ప్రాంతానికి వెళ్లేందుకు జనం కాస్త వెనకడుగు వేసినప్పటికీ.. మళ్లీ పెహల్‌గామ్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు..ప్రస్తుతం ఆ ప్రాంతం టూరిస్ట్‌లతో కళకళలాడుతోంది. వేసవిలో కశ్మీర్‌ అందాలను ఆస్వాదించేందుకు టూరిస్టులు మళ్లీ పెహల్గామ్‌ బాటపడుతున్నారు. అక్కడ అందమైన ప్రదేశాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
మరోవైపు కశ్మీర్‌‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను మూసివేసింది. లోయలో మొత్తం 87 పర్యాటక ప్రాంతాలుండగా.. అందులో 48 ప్రాంతాలను మూసివేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టూరిస్ట్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
RELATED ARTICLES

Most Popular

Recent Comments