Homebreaking updates newsWaqf Bill: అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం

Waqf Bill: అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం

భారత్ సమాచార్.నెట్,న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Bill )2025 ఉభయ సభలు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా.. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu)ఆమోద తెలపడంతో.. ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. దీంతో ఈ చట్టం అధికారికంగా ఏప్రిల్ 8 నుంచి అమలులోకి వచ్చిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ (Ministry of Minority Affairs) ప్రకటించింది. మంగళవారం ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని.

మరోవైపు వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీల ఎంపీలు, ముస్లిం సంఘాల ప్రతినిధిలు సుప్రీంకోర్టు (Supreme court)ను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై మొత్తం 15 పిటిషన్లు (Petitions) దాఖలు కాగా..ఈ పిటిషన్లంటినీ అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్ 16న విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లంటినీ విచారించనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేసే ముందు.. తమ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కోరింది.
ఇకపోతే వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమియత్ ఉలామ్-ఇ-హింద్, డీఎంకే, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్లోర్తి, మహ్మద్ జావేద్, ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, ఆర్జేడీ ఎంపీలు మనోజ్ ఝా, ఫయాజ్ అహ్మద్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ సహా పలువురు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. సవరించిన చట్టంలోని వివాదాస్పద నిబంధనల్లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు ముస్లిమేతర సభ్యులను తప్పనిసరిగా చేర్చడాన్ని ముస్లిం వర్గాలు తప్పుపడుతున్నాయి. వక్స్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
RELATED ARTICLES

Most Popular

Recent Comments