భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: కట్టుకున్న భార్య అదృశ్యం కావడంతో తన ప్రాణాలకు హాని ఉందని భర్త బిక్కు బిక్కుమంటూ భయపడుతూ బ్రతుకుతున్న ఘటన మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో జరిగింది. నర్సింగ్పూర్ జిల్లాలోని ప్రతాప్నగర్కు చెందిన పర్షు ఠాకూర్, రజనీబాయి ఠాకూర్ భార్యాభర్తలు. పర్షు భార్య రజనీబాయి ఠాకూర్ తన నగలతో తన తల్లి ఇంటిని విడిచిపెట్టి గత ఒక నెలరోజులుగా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. పర్షుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లల భవిష్యత్తు బాధ్యత అతనిపై ఉంది. కానీ ఇప్పుడు అతను తన ప్రాణాలకు హాని ఉందంటూ భయపడుతున్నాడు. తన భార్యకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆమె ఎవరితోనైనా సంతోషంగా జీవించడానికి వెళ్లినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పర్షు తెలిపాడు. ఆమెను తాను సంతోషంగా పంపేస్తానని, కానీ తన భార్య ఒక్కసారి ముందుకు వచ్చి తనతో కలిసి జీవించడం ఇష్టంలేదని స్పష్టంగా చెప్పాలని అతడు కోరాడు. పర్శు ఇండోర్ సంఘటనను పదే పదే ప్రస్తావిస్తూ, రాజాకు జరిగినది తనకు కూడా జరుగుతుందని భయపడుతున్నానని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.
‘నా భార్య ఎవరితో పోయినా పర్వాలేదు’
RELATED ARTICLES