భారత్ సమాాచార్.నెట్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ సాగర తీరం వేదికగా జరిగిన యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చోటు దక్కించుకుంది. ఏకకాలంలో లక్షలాది మంది యోగాసనలు వేశారు. ఈ మహా ప్రదర్శనకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో ఈ కార్యక్రమం కీర్తి మరింత పెరిగింది. గత పదేళ్లుగా జరుపుకుంటున్న ఈ యోగా దినోత్సవానికి ఈసారి ఆంధ్రప్రదేశ్ వేదికైంది.
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ తీరాన నిర్వహించిన ఈ యోగా కార్యక్రమంలో సుమారు 3 లక్షలకు పైగా ప్రజలు భాగస్వాములయ్యారు. ఈ ఈవెంట్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. దాదాపు 45 నిమిషాల పాలు యోగసనాలు వేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట, ఒకే సమయంలో యోగా చేయడం ద్వారా గతంలో గుజరాత్లోని సూరత్లో నమోదైన రికార్డును యోగాంధ్ర అధిగమించింది.
ఈ యోగా కార్యక్రమం అనంతరం యోగా డే లో పాల్గొన్న విద్యార్థులుతో ప్రధాని మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు పలువురు విద్యార్థులు. ఇక ఈ యోగా ఈవెంట్ ప్రధాని మోదీ ప్రసంగించారు. దశాబ్దకాలంలో యోగా సాధించిన ప్రస్తానం చూస్తే తనకు ఎన్నో విషయాలు గుర్తొకొస్తాయన్నారు. 11 ఏళ్లలో యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి జీవనశైలిలో భాగంగా మారింది.. జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినంగా జరపాలన్న భారతదేశ ప్రతిపాదనను తక్కువ సమయంలోనే 175 దేశాలు ఆమోదించాయని ప్రధాని మోదీ తెలిపారు.