Homebreaking updates newsడీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి జగన్ లేఖ

డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి జగన్ లేఖ

భారత్ సమాచార్.నెట్, ఏపీ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ప్రధాని మోదీ(PM Modi)కి లేఖ రాశారు. డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ వైఎస్ జగన్ లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. దక్షాణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని ప్రధాని మోదీని జగన్ కోరారు. అలాగే 2026లో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపడితే.. దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోంది. దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి.. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలి. కేంద్రం తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించాలి. లోక్‌సభ, రాజ్యసభలో.. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కోరుకుంటున్నా అంటూ లేఖలో జగన్ ప్రస్తావించారు.
ఇక ఇదిలా ఉంటే.. డీలిమిటేషన్ ప్రక్రియపై స్టాలిన్ నేతృత్వంలో చెన్నై వేదికగా.. శనివారం వివిధ రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమిలోని పార్టీలు మినహా.. అన్ని పార్టీల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా హాజరయ్యారు.
RELATED ARTICLES

Most Popular