భారత్ సమాచార్.నెట్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న మూవీ “ఫౌజీ”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా కొత్త హీరోయిన్ ఇమాన్వి నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సోల్జర్గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వి సోషల్ మీడియాలో హాట్ టాఫిక్గా మారారు. ఆమెను “ఫౌజీ” చిత్రం నుంచి తొలగించాలని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి.
పవాల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది అమాయక పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై యావత్ భారత్ దేశం తీవ్రంగా రగిలిపోతున్నది. ఈ క్రమంలోనే ప్రభాస్ “ఫౌజీ” హీరోయిన్ ఇమాన్వీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాకిస్థానీ మూలాలు ఉన్న అమ్మాయని, అమెరికాలో సెటిల్ అయ్యేముందు ఆమె తండ్రి పాకిస్థాన్ ఆర్మీలో మేజర్గా పనిచేశారని సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారంతా పాక్ నటులకు భారతీయ సినిమాల్లో అవకాశం ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాజాగా నటి ఇమాన్వీ స్పందించారు. తాను పాకిస్థానీ కాదంటూ స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్ చేసింది. అలాగే ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఇమాన్వీ తన పోస్టులో ఇలా రాసుకొచ్చింది.. నా కుటుంబానికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాలనుకుంటున్నాను. నా కుటుంబంలో ఎవరికీ పాకిస్తానీ మిలిటరీతో ఎలాంటి సంబంధం లేదని.. కేవలం ద్వేషాన్ని రగిలించడం కోసమే ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.
నా తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికాకు వలస వచ్చి.. అమెరికా పౌరులుగా మారారని.. నేను లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియాలో జన్మించానని తెలిపారు. నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన ఇండోఅమెరికన్ అంటూ క్లారిటీ ఇచ్చింది. కొన్ని పేరున్న వార్త సంస్థలు కూడా నా గురించి కనీస రీసర్చ్ చేయకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి అంటూ మండిపడ్డారు. యూఎస్లో విద్య పూర్తి చేసిన అనంతరం నటిగా కొరియోగ్రాఫర్గా, డ్యాన్సర్గా పనిచేస్తూ కళల పట్ల తన ఇంట్రెస్ట్ కొనసాగించానని.. ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో పనిచేసే అవకాశం దక్కినందుకు గర్వంగా భావిస్తున్నాను. భారత్ దేశంపై ప్రేమ, భక్తి నా రక్తంలోనూ ప్రవహిస్తోందని అని తన పోస్ట్లో రాసుకొచ్చారు.