భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: గతేడాది తనకెంతో ప్రత్యేకమని నటుడు నాగ చైతన్య (Naga Chaitanya) చెప్పారు. ‘తండేల్‌’తో తన కెరీర్‌ పూర్తిగా మారిపోయిందన్నారు. రూ.100కోట్ల క్లబ్‌లో చేరిన తన తొలి సినిమాగా అది ఎప్పటికీ ప్రత్యేకమన్నారు. ‘‘2025 నాకు చాలా ముఖ్యమైన సంవత్సరం. తండేల్‌ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడమే కాకుండా అది ఓటీటీ డీల్‌లోనూ రికార్డులు సృష్టించింది. నా కెరీర్‌లో థియేటర్‌లో ‘తండేల్‌’, ఓటీటీలో ‘దూత’ ఎంతో మార్పు తెచ్చాయి. ఇప్పుడు నా 25వ చిత్రం ‘వృషకర్మ’తో బిజీగా ఉన్నాను. ఇప్పటివరకూ చేయని…