భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి బ్రిటిష్‌ వలస పాలకులపై విప్లవించి అమరులైన యోధులలో ఒకరు అష్ఫాఖుల్లాఖాన్‌. 1900 అక్టోబర్‌ 22వ తేదీన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లోని సంపన్న జమిందారి కుటుంబంలో జన్మించారు. తండ్రి షఫీఖుల్లాఖాన్‌, తల్లి మజహరున్నీసా బేగం. చిన్ననాటి నుండే స్వతంత్ర భావాలను సంతరించుకున్న ఆయన ప్రజల జీవన పరిస్థితుల విూద దృష్టి సారించటంతో చదువు విూద పెద్దగా శ్రద్ధచూపలేదు. తల్లి నుండి సాహిత్యాభిలాష పెంచుకున్న ఆయన మంచి ఉర్దూ కవిగా రూపొందారు.…