భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియాకు ఆటగాళ్ల గాయాలు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కాగా, తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) కూడా గాయపడటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

 

నొప్పితోనే బ్యాటింగ్.. మైదానం వీడిన సుందర్

 

తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో సుందర్ ‘సైడ్ స్ట్రెయిన్’ (పక్కటెముకల కండరాల గాయం) బారిన పడ్డారు. ఐదు ఓవర్లు వేసిన తర్వాత నొప్పి తీవ్రమవ్వడంతో ఆయన మైదానాన్ని…