భారత్ సమాచార్. నెట్, న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకంలో చేరాలనుకునే మ్యుజీషియన్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ పథకంలో భాగంగా.. అగ్నివీర్‌ వాయు (మ్యుజీషియన్‌) నియామకాల ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు భారతీయ శాస్త్రీయ వాద్యాల్లోని ఏదైనా ఒక దాంట్లో నైపుణ్యం ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాల/ బోర్డు నుంచి మెట్రిక్యులేషన్‌/ టెన్త్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నిర్దిష్ట శారీరక / వైద్య ప్రమాణాలు, సంగీతానుభవ…