భారత్ సమాచార్, వెబ్డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం అత్యంత ప్రమాదకరంగా మారింది. దట్టమైన పొగమంచు (Dense Fog) కారణంగా దృశ్యమానత (Visibility) పూర్తిగా పడిపోవడంతో భారత వాతావరణ శాఖ (IMD) నగరానికి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ, బిహార్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.
డేంజర్ జోన్లో గాలి నాణ్యత (AQI)
సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలో వాయు కాలుష్యం కోరలు చాచింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) గణాంకాల ప్రకారం:…

