భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: పంజాబ్‌లో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన సమాజంలో పెరిగిపోతున్న సైబర్‌ నేరాల తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం సామాన్యులే కాదు, శాంతిభద్రతలపై పట్టున్న ఒక మాజీ ఉన్నతాధికారి కూడా ఈ ఉచ్చులో పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో అమాయకత్వాన్నే కాదు, నమ్మకాన్ని కూడా సైబర్ నేరగాళ్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. పంజాబ్‌లో మాజీ ఐజీపి హోదాలో పనిచేసిన అమర్‌సింగ్‌ చాహల్‌ సుమారు రూ. 8.10 కోట్ల మేర సైబర్‌ మోసానికి గురై, ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం తీవ్ర…