భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: గురుగ్రామ్‌లో జరిగిన మాస్టర్స్ యూనియన్ స్నాతకోత్సవానికి హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ‘హిట్‌మ్యాన్‌’ను సత్కరించారు. అనంతరం రోహిత్ 2023 వరల్డ్ కప్ గురించి మాట్లాడాడు. 2023 వరల్డ్ కప్‌లో భారత్ అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో ఓడిపోవడాన్ని క్రికెట్ అభిమానులు చాలా రోజుల వరకు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా భారత ప్లేయర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ ఫైనల్‌లో ఓటమితో తీవ్రంగా కుంగిపోయానని, క్రికెట్‌ను పూర్తిగా వదిలేద్దామనే ఆలోచన తన మనసులోకి వచ్చిందని అప్పటి…