భారత్ సమాచార్.నెట్: ఉగ్రవాదానికి (Terrorism) బహిరంగంగా మద్దతు ఇచ్చే దేశాలు తగిన మూల్యాన్ని చెల్లించక తప్పదని ప్రధాని మోదీ (PM Modi) స్పష్టం చేశారు. జీ 7 సదస్సు (G7 Summit)లో భాగంగా ప్రధాని మోదీ కెనడా (Canada)లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జీ 7 సదస్సులో ఆయన ప్రసంగించారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి.. మానవత్వంపై జరిగిన దాడి అని అన్నారు. ఇది భారతీయుల గౌరవం, గుర్తింపుపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని మానవాళికి పెను శత్రువుగా అభివర్ణించారు.