భారత్ సమాచార్, హైదరాబాద్: భారతదేశానికి అసాధారణమైన మేధో సామర్థ్యం ఉందని, దేశ శాస్త్ర వారసత్వాన్ని విద్యార్థులు, యువ పరిశోధకులు ముందుకు తీసుకెళ్లాలని ఐఐటీ మద్రాసు పూర్వ ఆచార్యుడు, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఐఎన్ఎస్ఏ సీనియర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ బి. యజ్ఞనారాయణ పిలుపునిచ్చారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ‘మాట్లాడటం వంటి సహజ సంకేతాలను ప్రాసెస్ చేయడంలో సవాళ్లు’ అనే అంశంపై ఆయన విశిష్ట ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్లోని ఈఈసీఈ విభాగం నిర్వహించింది.
సిగ్నల్ ప్రాసెసింగ్, స్పీచ్…





