భారత్ సమాచార్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్‌నగర్‌ ఇందిరా మార్కెట్ సమీపంలోని బ్రిడ్జ్ వద్ద భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. కొండ చెలువను గమనించిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గత వారం రోజుల క్రితం రైల్వే స్టేషన్ సమీపంలో కొండచిలువ కనిపించిన విషయం తెలిసిందే. మళ్లీ కొండచిలువ మార్కెట్ సమీపంలో కనిపించడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

మరిన్ని కథనాలు: 

కొండచిలువ కలకలం, అటవీశాఖ అధికారుల అప్రమత్తత