భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బంతి కోసం పోరు.. పాయింట్ కోసం పట్టుదల.. విజయం కోసం చివరి వరకు ఉత్కంఠ.. నర్సాపూర్ బి.వి.ఆర్.ఐ.టి కళాశాల వేదికగా నిర్వహించిన రాక్‌బాల్ జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. అజయ్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన 10వ సీనియర్ నేషనల్, 7వ సీనియర్ మిక్స్‌డ్ నేషనల్ రాక్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్‌లు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగగా, చివరకు హర్యానా జట్టు పలు…