భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇటీవల ఐఐటీ హైదరాబాదు ప్రాంగణంలోని డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల కోసం ఒక ఆసక్తికరమైన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. వాస్తుశిల్పం, డిజైన్ ప్రపంచానికి సంబంధించిన విజ్ఞానదాయన పరిచయాన్ని అందించింది. పాఠశాల విద్యా విజ్ఞాన కార్యక్రమాలలో భాగంగా, డీఏవీలోని 10, 11, 12 తరగతులకు చెందిన 58 మంది విద్యార్థులు, మరో ముగ్గురు అధ్యాపకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్శనలో భాగంగా, పలు ముఖాముఖి కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు,…