భారత్ సమాచార్, అల్లూరి జిల్లా: రంపచోడవరం డివిజన్ వ్యాప్తంగా ప్రజలు మౌళిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వాటిని క్రమ పద్దతిలో పరిష్కారం చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీషదేవి కోరారు. ఈ మేరకు మంగళవారం ఐటీడీఏ కార్యాలయానికి విచ్చేసిన అల్లూరి కలెక్టర్ దినేష్ కుమార్ ని కలిశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాజవొమ్మంగి మండలంలో కొన్ని రహదారులు కావాలని, అడ్డతీగల మండలం కొత్తూరు నుండి బందమామిళ్ళు వరకూ రోడ్డు సౌకర్యం మెరుగు పర్చాలని కోరారు.…