భారత్ సమాచార్.నెట్, కర్నూలు: కోసిగి తిమ్మప్ప, బసవన్న కొండల్లో చిరుతలు గత కొంతకాలంగా సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బసవన్న కొండ వెనుక ఉన్న ఎర్ర వంకలో చిరుతపులి కనిపించడంతో యువకులు దానిని వీడియో తీశారు. అనారోగ్య సమస్యతో పరిగెత్తడం చేతకాకపోవడంతో యువకులు, స్థానిక ప్రజలు దాన్ని వీడియోలు, ఫోటోలు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై హనుమంతరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని చిరుత వారి వద్దకు వెళ్లకుండా చెదరగొట్టారు.
రైతుపై పంజా విసిరిన చిరుత:
సమాచారం అందించి రెండు గంటలైనా అటవీ శాఖ…



