భారత్ సమాచార్.నెట్, మెదక్: నర్సాపూర్ మైనార్టీ పాఠశాల నుంచి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు క్షేమంగా లభించడంతో పాఠశాల సిబ్బందికి ఊరట లభించింది. ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం మహమ్మద్ అమెర్, మహమ్మద్ నవాజ్ అలీ కనిపించకుండా పోవడంతో ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపులో భాగంగా పిల్లలు వారి తండ్రి వద్దకు వెళ్లినట్టు గుర్తించారు. బుధవారం వారిని క్షేమంగా పాఠశాల సిబ్బందికి అప్పగించారు.
మరిన్ని కథనాలు





