భార‌త్ స‌మాచార్.నెట్, నిజామాబాద్: బోధన్ మండల ఫొటో, వీడియో అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కొత్త గోవిందు ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్, ఏసీపీ శ్రీనివాస్, సీఐలు వెంకటనారాయణ, విజయ్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ.. ఫొటోగ్రాఫర్లు మారుతున్న సాంకేతికతను, డిజిటల్ ట్రెండ్స్‌ను దృష్టిలో పెట్టుకొని తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలని సూచించారు. డ్రోన్ కెమెరాలను ఉపయోగించేటప్పుడు పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఏసీపీ శ్రీనివాస్…