భారత్ సమాచార్.నెట్, తిరుమల: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా విరాజిల్లుతున్న టీటీడీ మరోసరికొత్త ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. హిందూ సనాతన ధర్మం గురించి విద్యార్థులకు బోధించడం.. అలాగే వారిలో నైతిక విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది టీటీడీ. సద్గమయ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది.
ఈ నెల 28న టీటీడీ పాఠశాలల్లో సద్గమయ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు టీటీడీ తెలిపింది. నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుందని.. తిరుపతి, తిరుమలలోని 7…



