భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: ఆలూరు పరిధిలోని హాలహర్వి మండల పోలీస్ స్టేషన్‌ను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ బుధవారం ఆకస్మికంగా సందర్శించి, వార్షిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్‌లో నమోదైన, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, డ్రంకెన్ డ్రైవ్ కేసులపై కఠినంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను వేగంగా చేధించి రికవరీలు చేయాలని, విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని ఆదేశించారు. బాధితుల…