భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: జిల్లాలో మాతృ మరణాలు, శిశు మరణాలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆగస్టు 2025 నుంచి జిల్లాలో నమోదైన ఆరు మాతృ మరణాలపై వైద్యాధికారులు, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, మృతుల కుటుంబ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరణాలు ఎలా జరిగాయనే అంశంపై డాక్టర్లు, కుటుంబ సభ్యులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు…
శిశుమరణాలు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలి: కలెక్టర్ సిరి



