భారత్ సమాచార్, ఆంధ్రప్రదేశ్: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికలకు వచ్చే ఏడాది మార్చి నెల వరకు గడువు ఉందని గుర్తు చేశారు. నిర్ణీత గడువులోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు వైసీపీ హయాంలో తిరుమల పరకామణిలో జరిగిన చోరీ కేసును సిట్‌తో దర్యాప్తు చేయిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు.