భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: ఎమ్మిగనూరు మండలం రాంనగర్, గుడికల్ సహా ఆస్పరి మండలంలోని పలు గ్రామాల్లోని పాఠశాలల్లో ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు ఎం. మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సేవాలాల్ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టారు.ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యారంగ సమస్యలపై ఆప్టా నాయకత్వం సమర్థంగా స్పందిస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వం వేగంగా పెరుగుతోందని తెలిపారు. 1969లో ప్రభుత్వ గుర్తింపు పొందిన మొదటి ఉపాధ్యాయ సంఘం…
విస్తృతంగా ఆప్టా సభ్యత్వ నమోదు





